Home » ముద్రగడకి ఘోర అవమానం.! వైసీపీ శవ రాజకీయం.!

ముద్రగడకి ఘోర అవమానం.! వైసీపీ శవ రాజకీయం.!

by hellomudra
0 comments
Mudragada Padmanabha Reddy

Mudragada Death Dirty Politics.. వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో కన్నుమూశారు. స్వగ్రామం కిర్లంపూడిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.

కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల విషయమై ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఉద్యమం అప్పట్లో సంచలనం. ఆ ఉద్యమంలోకి అసాంఘీక శక్తులు చొరబడి, రైలు దహనానికి తెగబడటం.. అది వేరే చర్చ.

అత్యంత వ్యూహాత్మంగా ముద్రగడ పద్మనాభంని తమవైపుకు తిప్పకున్న వైసీపీ, ముద్రగడ మరణం తర్వాత, ఆయన పార్తీవ దేహానికి అధికారిక లాంఛనాలు దక్కకుండా చేయాలని కుట్ర పన్నింది.

చివరి రోజుల్లో, ముద్రగడే అధికారిక లాంఛనాలు వద్దనుకున్నారంటూ వైసీపీ వింత పోకడలకు తెరలేపింది. అంతేనా, కుమార్తె బార్లపూడి క్రాంతి తన తండ్రిని చివరి చూపు చూసుకునేందుకూ వైసీపీ ఒప్పుకోలేదు.

Mudragada Death Dirty Politics.. వైసీపీ చేసింది మహాపాపం..

పార్టీలకతీతంగా ముద్రగడ పద్మనాభం పట్ల గౌరవభావంతో వుంటారు చాలామంది రాజకీయ నాయకులు.

వివిధ రాజకీయ పార్టీల్లోని కాపు సామాజిక వర్గ నేతలే కాకుండా, ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలూ ఆయనకు అత్యంత సన్నిహితులు.

తండ్రి, కుమార్తె మధ్య రాజకీయ పరమైన విభేదాలున్నాయి. ఈ క్రమంలో ‘నేను చనిపోయాక కూడా, నా శవాన్ని చూడటానికి రావొద్దు’ అని ముద్రగడ పద్మనాభం స్వయంగా వ్యాఖ్యానించారు.

కానీ, రాజకీయం వేరు.. రక్త సంబంధం వేరన్న కనీస ఇంగితం వైసీపీకి లేకుండా పోయింది. కుటుంబ పరమైన విభేదాలున్నాసరే, ఇలాంటి సందర్భాల్లో అవన్నీ పక్కన పెట్టేస్తారు ఎవరైనా.

అయితే, ముద్రగడ కుమార్తె క్రాంతి విషయంలో మాత్రం, వైసీపీ కుట్రలదే పై చేయి అయ్యింది. తండ్రిని కడసారి చూసుకునేందుకు క్రాంతి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.

చివరికి టీవీల్లోనే తండ్రి అంత్యక్రియల్ని చూడాల్సి వచ్చింది ముద్రగడ కుమార్తె క్రాంతికి. రాజకీయాల్లో ఈ విష సంస్కృతిని తీసుకొచ్చింది వైఎస్సార్సీపీనే.

పార్టీ శ్రేణుల్ని వైఎస్ జగన్ అదుపు చేసుకోలేకపోయారా.?

అధినేత వైఎస్ జగన్, తమ పార్టీ శ్రేణుల్ని ఈ విషయమై కొంత వారించి వుండాల్సింది. సుద్దులు చెప్పి వుండాల్సింది. రక్త సంబంధం కంటే, ఏ రాజకీయమూ ఎక్కువ కాదు.

జగన్, షర్మిల మధ్య రాజకీయ, ఆర్థిక పరమైన విభేదాలున్నాయి. జగన్, విజయమ్మ మధ్య ఏకంగా ఆస్తి సంబంధిత తగాదాలున్నాయి.. అవి కోర్టులో నడుస్తున్నాయి.

అలాగని, వైఎస్సార్ ఘాట్ దగ్గరకి షర్మిల, విజయమ్మని రాకుండా చేయడం లేదు కదా వైఎస్ జగన్. మరి, ముద్రగడ కుమార్తె విషయంలో ఎందుకిలా వైసీపీ చేసినట్లు.?

అధికారిక లాంఛనాలు అనేవి గౌరవ సూచకమైనవి. వాటిని ముద్రగడకు దూరం చేయడమంటే, ఇది ఘోర అవమానం.

నిజానికి, ఇది మహా పాపం.! కర్మ ఎవర్నీ వదిలి పెట్టదు.! వైఎస్ జగన్ ఆ విషయాన్ని తెలుసుకుంటే మంచిది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group