Ys Jagan Publicity Pathara.. కొన్ని మాటలు ఇబ్బందికరంగా వుంటాయ్.! ‘ఎవడబ్బ సొమ్మనీ’ అనే మాట కూడా.! కానీ, సందర్భం అలాంటిది.!
రాజకీయం అంటే ప్రజా సేవ.! దానర్థం, పాలకుడంటే ప్రజా సేవకుడని.! అలాంటప్పుడు, సేవకుడు తన పేరుని సంక్షేమ పథకాలకి పెట్టుకోవచ్చా.?
పైగా, ఖర్చయ్యేది ప్రజా ధనం.! సో, ఎవరు అధికారంలో వున్నా, సంక్షేమ పథకాలకి తమ పేర్లను పెట్టుకునేందుకు అర్హులు కారు.
Ys Jagan Publicity Pathara.. రాజకీయం.. అత్యంత జుగుప్సాకరం..
జగన్ విషయంలోనే కాదు, చంద్రబాబు విషయంలో అయినా, ఇదే వర్తిస్తుంది. ఖర్చవుతున్నది ప్రజాధనం.. సంక్షేమం అంటే, ప్రజల హక్కు.
ప్రభుత్వాలు ఎక్కడి నుంచి తీసుకొస్తాయ్ సొమ్ముల్ని.? ప్రజలు కట్టే పన్నులే, ప్రజాధనం. ఆ ప్రజల మీదనే అప్పులు చేయాలి. ఆ అప్పులకు వడ్డీలు కూడా, ప్రజల ముక్కు పిండే వసూలు చేయాలి.
విషయం ఇంత స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, అధికారంలో వున్నోళ్ళు ఎలా తమ పేర్లను పెట్టుకుంటారు సంక్షేమ పథకాలకైనా, ప్రజాధనంతో ఖర్చు చేసే ఇంకే పనికి అయినా.?
జగన్ పబ్లిసిటీ పైత్యానికి పాతరేసేశారు..
వైఎస్సార్ జగనన్న భూరక్ష.. అంటూ కనిపిస్తోంది కదా.! ఇది ఓ హద్దు రాయి. ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా భూముల రీ-సర్వే జరిగింది. ఈ క్రమంలో హద్దు రాళ్ళని ఇలా ఏర్పాటు చేశారు.
అప్పట్లో, ఈ విషయమై పెద్ద దుమారమే చెలరేగింది. ఇదంతా దేనికోసం.? జనం తమని మర్చిపోకూడదని ఇలా చేస్తుంటారా.?
Also Read: ఇసుక రాజకీయం.! ఇదొక మాఫియా.! ఎనీ డౌట్స్.?
2019 ఎన్నికలకు ముందు ‘చంద్రన్న’ పేరుతో చాలా సంక్షేమ పథకాలు నడిచాయ్. కానీ, జనం టీడీపీకి ఓటెయ్యలేదు.
2024 ఎన్నికలకు ముందర ‘జగనన్న’ పేరుతో సంక్షేమ పథకాలు.! ఏమయ్యింది.? వైసీపీని పాతరేశారు రాష్ట్ర ప్రజానీకం.!
అసలంటూ, రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిథులుగా మారి గౌరవ వేతనం తీసుకుంటున్నారంటేనే.. అది ప్రజాధనంతో.! జీతగాళ్ళు, యజమానులకి ‘సంక్షేమం’ అనే బిచ్చం వేయడమేంటి.. నాన్సెన్స్ కాకపోతే.
Mudra369
ఇప్పటికైనా రాజకీయ నాయకులు, పార్టీలు బుద్ధి తెచ్చుకోవాలి. పైకి గట్టిగా చెప్పకపోయినా, ప్రజలు సంక్షేమాన్ని తమ హక్కుగానే భావిస్తారు. సంక్షేమం అంటే, ఎవరో వేసే బిచ్చం కాదు.!
ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరు దెబ్బ కొట్టినా, శిక్ష అనుభవించాల్సిందే.! సంక్షేమ పథకాలకి తమ పేర్లు పెట్టుకునే ముందర ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. లేదంటే, జనం రాజకీయంగా పాతరేసేస్తారు.!