Pawan Kalyan Narendra Modi.. ఇద్దరు రాజకీయ ప్రముఖులు కలిస్తే, వాళ్ళకెందుకు ఏడుపు.? ఎందుకంటే, ఓ రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తున్నారు కాబట్టి. మీడియా అంటే ఎలా వుండాలి.? అని చర్చించుకునే రోజులు కావివి.
అసలు జర్నలిజం ఎక్కడుంది.? రాజకీయ పార్టీలకు కొమ్ము కాసే ‘బజారుతనం’ తప్ప.! అనే భావన ప్రజల్లో పెరిగిపోయింది.
ప్రధాని నరేంద్ర మోడీతో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు. ఇదీ వార్త.! కానీ, ‘పవన్ కళ్యాణ్ కష్టం పగవాడిక్కూడా రాకూడదు’ అంటూ విశ్లేషిస్తున్నారు.
Pawan Kalyan Narendra Modi.. ఏం జరిగిపోయిందని.?
ఔను, చాలాకాలమయ్యింది పవన్ కళ్యాణ్ – ప్రధాని మోడీ కలుసుకుని.! ఎందుకు కలుసుకోలేదు.? అన్నది ఆ ఇద్దరు వ్యక్తుల, ఆ రెండు పార్టీల అంతర్గత వ్యవహారమే.
విశ్లేషణలో తప్పు లేదు. కానీ, విశ్లేషణ చేయాల్సింది జర్నలిస్టులు తప్ప, పాత్రికేయ వ్యభిచారులు కాదు.! అదీ అసలు సంగతి.

మోడీ – పవన్ కలిస్తే ఏమయిపోతుంది.? ఎవరికైనా మళ్ళీ జైలు ప్రాప్తి తప్పదని సోకాల్డ్ ‘పాత్రికేయ వ్యభిచారం’ నిర్వహిస్తున్నవారి ఆవేదన అనుకోవాలా.? అంతేనేమో.!
దిగజారుడుతనంలో వేరే లెవల్..
ముఖ్యమంత్రికి ప్రధాని అపాయింట్మెంట్ దొరక్కపోతే.. అది పెద్ద విషయం. రెండు పార్టీల మధ్య స్నేహం వున్నా, ఆ పార్టీలకు చెందిన నాయకులు కలుసుకోకపోతే, దాని వల్ల సమాజానికి వచ్చిన నష్టమేంటి.?
Also Read: వ్యూహం.! శపథం.! ఆర్జీవీ మార్కు సినీ భ్రష్టత్వం.!
సోకాల్డ్ పాత్రికేయ వ్యభిచారుల బాధేంటంటే, పవన్ కళ్యాణ్ చేసే రాజకీయం వాళ్ళకు మింగుడు పడ్డంలేదు. అధికారంలో వుండి దోచుకోవాలి తప్ప.. ప్రజల్లో చైతన్యం కోసం ఏ రాజకీయ నాయకుడూ పని చేయకూడదు.
ప్రజా ధనం కాస్తా ప్రకటనల రూపంలో ‘కుల మీడియా’లకి పంచిపెట్టాలన్నది సోకాల్డ్ పాత్రికేయ వ్యభిచారుల ఉవాచ. ఆ ‘ముష్టి’తో బతకడానికి అలవాటుపడ్డాక, ఇలా కాక ఇంకెలా వస్తాయ్ రాతలు.?