Nandamuri Balakrishna Assembly MLA తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కామెడీ పీస్ అయిపోయారా.?
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా, నందమూరి బాలకృష్ణని ‘మెంటల్’ అనేస్తోంది. అసెంబ్లీకి రానివ్వద్దంటూ బాలయ్యపై గుస్సా అయ్యారు వైసీపీ శాసనసభ్యులు కొందరు.
దేశంలో మెంటల్ సర్టిఫికెట్ వున్న ఒకే ఒక్క ప్రజా ప్రతినిధి నందమూరి బాలకృష్ణ అని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు.
Nandamuri Balakrishna Assembly MLA.. ఎందుకీ పరిస్థితి.?
మంత్రి అంబటి రాంబాబుపై నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మీసం మెలేసి, తొడకొట్టడం వివాదాస్పదమయ్యింది.
ఆ తర్వాత అసెంబ్లీలోనే, బాలయ్య చిత్ర విచిత్రమైన సంజ్ఞలు చేసి.. మరింతగా వివాదాల్లోకెక్కారు. ఈ క్రమంలో బాలయ్యను వైసీపీ మేగ్జిమమ్ టార్గెట్ చేస్తోంది.
ప్రత్యేకించి, ‘నేను కాపు బిడ్డని’ అంటూ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా కుల ప్రస్తావన తీసుకురావడం, అత్యంత వ్యూహాత్మకమే.
ఆ సామాజిక వర్గం నుంచే..
అంబటి రాంబాబు, కన్నబాబు.. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. వెరసి వివాదం కమ్మ వర్సెస్ కాపు.. అన్నట్టుగా మారింది.
రెండు పార్టీల మధ్య రాజకీయ పోరుని, రెండు సామాజిక వర్గాల మధ్య పంచాయితీలా మార్చేందుకు అధికార వైసీపీ ప్రయత్నిస్తున్న వైనం సుస్పష్టం ఇక్కడ.
వైసీపీ వ్యూహానికి నందమూరి బాలకృష్ణ భలే చిక్కేశారు. గడచిన నాలుగున్నరేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో పెద్దగా సందడి చేయని బాలయ్య, ఇప్పుడిలా ఎందుకు అత్యుత్సాహం చూపి అభాసుపాలవుతున్నట్టు.?
బాలయ్య అభిమానులు, తమ అభిమాన నటుడికి జరుగుతున్న అవమానాన్ని చూసి, ఆయన వ్యవహరిస్తున్న తీరు చూసి కొంత ఆవేదన, ఆందోళన కూడా చెందుతున్నారు.
Also Read: జూ.ఎన్టీయార్కి ‘చంద్ర’గ్రహణం.! బాలయ్య కనుసన్నల్లో.?
కొందరు సినీ నటుల్ని రాజకీయాల్లో చిన్న చిన్న విషయాలకీ అవమానించడం పరిపాటిగా మారిపోయింది. దీని కోసం కొన్ని ప్రత్యేక పెయిడ్ బృందాలూ పని చేస్తున్నాయి.
ఈ క్రమంలో సినీ ప్రముఖులు రాజకీయాల్లో ఒకింత అప్రమత్తంగా వుండక తప్పదు. అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలి.