Sai Pallavi Take On Chiranjeevi.. రీమేక్ సినిమాల్లో నటించడం కొంత తేలిక.. కొంచెం కష్టం.. అని భావిస్తుంటారు నటీనటులు. సంచలన విజయాల్ని అందుకున్న సినిమాలే ఎక్కువగా రీమేక్ అవుతుంటాయి. అలా సక్సెస్ అయిన సినిమాల్ని రీమేక్ చేసేటప్పుడు.. ఒరిజినల్ స్థాయిని అందుకోవడానికి దర్శక నిర్మాతలు, నటీనటులు ఒకింత ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.
అసలు రీమేక్ సినిమాలంటే సాయి పల్లవికి ఎందుకంత భయం.? తమిళ సినిమా ‘వేదాలం’ తెలుగులోకి రీమేక్ అవుతోంటే, అందులో నటించడానికి సాయి పల్లవి ఎందుకు ‘నో’ చెప్పింది.? మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో అవకాశం వస్తే, సాయి పల్లవి ‘సారీ’ చెప్పడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.
Also Read: సాయి పల్లవికి ‘ఫిదా’ అయ్యేదందుకే..
ఈ విషయమై చిరంజీవి నేరుగా, సాయి పల్లవినే అడిగేశారు.. తనదైన స్టయిల్లో. ‘సాయి పల్లవి నా సినిమాకి నో చెప్పడం.. మొదట ఆందోళన కలిగించి, ఆ తర్వాత సంతోషాన్నిచ్చింది..’ అని చిరంజీవి వ్యాఖ్యానించడంతే, అక్కడే వున్న సాయి పల్లవి కంగారుపడింది.
‘నేను మిమ్మల్ని కలవడమే అదృష్టంగా భావిస్తాను. అలాంటిది, మీతో సినిమా చేసే ఛాన్స్ వదులుకుంటానా.? రీమేక్ సినిమాలంటే నాకు భయం. అందుకే, ఆ సినిమా చేయలేకపోయాను..’ అంటూ సాయి పల్లవి చిరంజీవి యెదుట తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన ‘వేదాలం’ సినిమా, తెలుగులోకి ‘భోళా శంకర్’ పేరుతో రీమేక్ అవుతున్న విషయం విదితమే. సాయి పల్లవి వదిలేసుకున్న పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. చిరంజీవి చెల్లెలి పాత్ర అది.
Also Read: సాయి పల్లవి మీద మళ్ళీ ‘ఆ’ బాంబు పడింది
ఇంతకీ, సాయి పల్లవికి రీమేక్ సినిమాలంటే ఎందుకంత భయం.? నటన విషయంలో మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్.. అనిపించుకున్న సాయి పల్లవి, ‘భోళా శంకర్’ విషయంలో ‘నో’ చెప్పడం ఆశ్చర్యకరమే. అయితేనేం, స్టేజీ మీద చిరంజీవితో కలిసి సాయి పల్లవి డాన్స్ చేసేసి.. అభిమానుల్ని ఖుషీ చేసేసింది.
‘సాయి పల్లవి హీరోయిన్గా నా సినిమాలో వుంటే.. మేమిద్దరం డాన్స్ చేయడాన్ని ఇష్టపడతాను.. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా..’ అని చిరంజీవి చెప్పడం కంటే, సాయి పల్లవి (Sai Pallavi Take On Chiranjeevi)అందుకునే పెద్ద అవార్డ్ ఇంకేముంటుంది.?