Home » రుషికొండ ప్యాలెస్సు.! జగన్ మార్కు రాచరిక విష వృక్షం.!

రుషికొండ ప్యాలెస్సు.! జగన్ మార్కు రాచరిక విష వృక్షం.!

by hellomudra
0 comments
Rushikonda Palace

YS Jagan Rushikonda Palace.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం అనే ఓ నగరం వుంటుంది.! దాన్నే, వైజాగ్ అని కూడా అంటారు.! ఉత్తరాంధ్రకి పెద్ద దిక్కు ఈ నగరం.!

ఒకప్పుడు విశాఖపట్నం అంటే, సుందరమైన సముద్ర తీరం గుర్తుకొచ్చేది.! ఇప్పుడేమో, ఆ విశాఖపట్నంలోని ‘రుషికొండ’ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.!

రుషికొండ గురించి తెలియకపోవడమేంటి.? చాలామందికి తెలుసు.! కాకపోతే, ఆ తెలియడం వేరు, ఇప్పుడు తెలుస్తున్న విధానం వేరు.!

ఆ రుషికొండ మీద ఒకప్పుడు పర్యాటక శాఖకు సంబంధించిన నిర్మాణాలుండేవి. ఇప్పుడు వాటి స్థానంలో ఓ ప్యాలెస్ సముదాయం వచ్చిపడింది.

YS Jagan Rushikonda Palace.. ప్యాలెస్సా.? టూరిజం భవనమా.? సీఎం క్యాంప్ ఆఫీసా.?

దాన్ని ప్యాలెస్ అనాలా.? ఇంకేమన్నా అనాలా.? ఇదే ఇప్పుడెవరికీ అర్థం కాని ప్రశ్న. పర్యాటక శాఖ నిర్మించిన భవన సముదాయం అది. దాన్ని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కోసం వినియోగించాలనుకున్నారు.

వైసీపీ హయాంలో ఈ నిర్మాణాలు ప్రారంభమై, దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం అయితే, వినియోగానికి అనుకూలంగానే వున్నాయి ఈ భవనాలు.

Rushikonda Palace
Rushikonda Palace

కాకపోతే, రుషికొండ మీదున్న ఈ ప్యాలెస్ భవన సముదాయాన్ని ఎలా వినియోగించుకోవాలో అర్థం కాని పరిస్థితి.

సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వయంగా, ‘వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలియడంలేదు’ అని వ్యాఖ్యానించారు మరి.

జగన్ కోసమే అని చెప్పారు కదా.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం హుడావిడిగా ఈ భవన సముదాయాన్ని నిర్మించారన్నది బహిరంగ రహస్యం. ముప్ఫయ్యేళ్ళు తానే ముఖ్యమంత్రిగా వుంటానన్న గట్టి నమ్మకంతో, ఆయనే ఈ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇది రాచరికం కాదు, ప్రజాస్వామ్యం కదా.! జగన్ మోహన్ రెడ్డిని పీకి పక్కనెట్టారు, రాష్ట్ర ప్రజలు. ఆయన కోసం నిర్మించిన భవనాలు, ప్రభుత్వ భవనాలు కావడంతో.. వాటిపై ఆయనకు హక్కుండదు.

హక్కుండదు సరే, బాధ్యత సంగతేంటి.? అసలక్కడ ఏం కట్టారు.? దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి, నిర్మించిన ఆ నిర్మాణాల్ని దేనికోసం వినియోగించాలి.?

Rushikonda Palace
Rushikonda Palace

వినియోగించడానికి వీల్లేని పరిస్థితి వుంటే, ఆ ఐదు వందల కోట్ల రూపాయల్ని ఎలా తిరిగి రాబట్టాలి.? ఇదిప్పుడు అసలు సిసలు టాస్క్.!

ప్రభుత్వం నిర్మించిన భవనాలవి, జగన్ వ్యక్తిగత అవసరాల కోసం నిర్మించింది కాదు.. కాబట్టి, ప్రస్తుత ప్రభుత్వం వాటిని ఎలాగోలా వాడేసుకోవాలని వైసీపీ అంటోంది. బాధ్యతారాహిత్యంతో కూడిన సిగ్గుమాలినతనమే ఇది.

బాధ్యతల నుంచి పారిపోతున్న వైసీపీ..

కట్టింది వైసీపీ హయాంలో కాబట్టి, అక్కడ ఏం కట్టి సచ్చారో చెప్పాల్సిన బాధ్యత వైసీపీ మీదనే వుంది.!

‘తాజ్’ లాంటి గ్రూపుకి హోటల్ నిమిత్తం ఇవ్వాలన్నా వీలుకాని పరిస్థితి వుందట. ఇదెక్కడి పంచాయితీ.?

రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖుల కోసం ‘స్టేట్ గెస్ట్ హౌస్’లా వాడుకోవచ్చంటూ వైసీపీ ఉచిత సలహా ఇస్తోంది.

Rushikonda Palace
Rushikonda Palace

ఏడాదికి ఓ సారో, రెండు సార్లో వచ్చే ప్రముఖుల కోసం 500 కోట్లతో ప్యాలెస్ సముదాయం నిర్మించడమా.? ప్రతినెలా దాని నిర్వహణ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోయగలదా.?

ప్రజా ధనం ఎంతలా వైసీపీ పాలనలో దుర్వినియోగమయ్యిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.!

రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి అనుకున్నాంగానీ.. జగన్ లాంటి రాజకీయ నాయకుల రూపంలో రాచరిక పోకడలు ‘విష వృక్షం’లా విస్తరించాయని రుషికొండ ప్యాలెస్ భవంతుల్ని చూస్తే అర్థమవుతుంది.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group