Home » తల్లివే కదా రోజా! పసి పిల్లలపై ‘ఆడింగి వెధవతనం’ తప్పని తెలీదా?

తల్లివే కదా రోజా! పసి పిల్లలపై ‘ఆడింగి వెధవతనం’ తప్పని తెలీదా?

by hellomudra
0 comments
Roja Selvamani

Roja Selvamani Disgusting Politics.. మాజీ మంత్రి, ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్’ పార్టీ నేత ఆర్కే రోజా, మళ్ళీ వార్తల్లోకెక్కారు.! తన స్థాయిని తానే దిగజార్చుకోవడం ఆమె ప్రత్యేకత.

ఇంకోసారి, తన స్థాయిని తనదైన స్టయిల్లో పాతాళానికి తొక్కేసుకున్నారు ఈ మాజీ మంత్రి.! అసలు, రోజా ఏం తప్పు చేశారు.? తప్పు కాదు, తప్పున్నర తప్పు అది.!

అసలేం జరిగిందంటే, తిరుపతిలో వైసీపీ వర్సెస్ టీడీపీ.. ‘గోవుల’ విషయమై రచ్చ జరిగింది. ఈ క్రమంలో రోడ్డు మీద బైఠాయించారు వైసీపీ నేతలు.

అంతే, మీడియా మైకు దొరికింది కదా.. అని, రెచ్చిపోయారు రోజా. రాజకీయాలన్నాక విమర్శలు మామూలే. కానీ, ఆ రాజకీయ విమర్శల్లోకి పిల్లల్ని లాగడం దుర్మార్గం.

Roja Selvamani Disgusting Politics.. ఆమెకీ ఇద్దరు పిల్లలున్నారు కదా.!

రోజాకి కూడా ఇద్దరు పిల్లలున్నారు.! అలాంటప్పుడు, రాజకీయ ప్రత్యర్థుల పిల్లల మీద దిగజారుడు కామెంట్లు చేయడమేంటి.? నేరుగా కాదుగానీ, రోజా టార్గెట్ చేసింది మాత్రం, పవన్ కళ్యాణ్ పిల్లల్నే.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ఇటీవల అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. అదృష్టవశాత్తూ గాయాలతో బయటపడ్డాడు.

అంత పెద్ద ప్రమాదం నుంచి తన బిడ్డ తృటిలో ప్రాణాపాయం తప్పించుకోవడంతో, మార్క్ శంకర్ తల్లి అన్నా లెజినెవా, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామికి తల నీలాలు సమర్పించుకున్నారు.

ఆ అగ్ని ప్రమాద ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ‘వెంకటేశ్వర స్వామి ఆగ్రహమేంటో చంద్రబాబు చూశారు.. పవన్ కళ్యాణ్ కూడా ఇటీవలే చూశారు..’ అంటూ రోజా నోరు పారేసుకున్నారు.

తల్లడిల్లిన తల్లి..

నిజానికి, ఆ వెంకటేశ్వర స్వామి దయతోనే మార్క్ శంకర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని అన్నా లెజినెవా భావించి, తాను క్రైస్తవురాలు అయి వుండీ, తిరుమలలో తలనీలాలు సమర్పించారు.

బహుశా అది జీర్ణించుకోలేకపోయినట్టున్నారు రోజా.! పసి పిల్లల మీద దైవానుగ్రహం వుంటుందేగానీ, ఆగ్రహం వుండదని మంత్రిగా గతంలో పని చేసిన రోజాకి తెలియదా.?

Also Read: తల్లడిల్లిన ‘తల్లి’ వెంకన్నకి తలనీలాలు ఇచ్చేసింది.!

అన్నట్టు, ‘ఆడింగి వెధవలు’ అంటూ, రాజకీయ ప్రత్యర్థులపై మీడియా సాక్షిగా దిగజారుడు వ్యాఖ్యలు చేశారు రోజా.

ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగానే అయినా, పవన్ కళ్యాణ్ కుటుంబంపై రోజా చేసిన వ్యాఖ్యల్ని కదా, ‘ఆడింగి వెధవతనం’ అనేది.?

రాజకీయాల్లో సభ్యత, సంస్కారం అవసరం. కానీ, అలాంటివి ఆర్కే రోజా లాంటివాళ్ళ నుంచి ఆశించడం తప్పే అవుతుంది. ఏ స్థాయికైనా రాజకీయంగా దిగజారడం రోజాకి వెన్నతో పెట్టిన విద్య.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group